News March 9, 2025
సిరిసిల్ల: విఘాతం కలిగిస్తే కఠినచర్యలు: ఎస్పీ

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. సామాన్యుడి దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు.
Similar News
News November 7, 2025
భారత రైతాంగ ఉద్యమపితామహుడు మన జిల్లావారే

రైతు జన బాంధవుడు ఆచార్య ఎన్.జీ.రంగా పొన్నూరులోని నిడుబ్రోలులో 1900 నవంబర్ 7న జన్మించారు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1934లో రైతు ప్రతినిధిగా పార్లమెంటులో అడుగు పెట్టి 1991వరకు ఉభయ సభల్లో కొనసాగి, గిన్నిస్ బుక్ ఎక్కారు. నిడుబ్రోలులో రామినీడు రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి ఎందరో రాజకీయ నాయకులను అందించారు.
News November 7, 2025
చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్పూర్లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.
News November 7, 2025
GNT: రచనలను, ఉద్యమాలే ఆయన జీవిత ధ్యేయం

ప్రముఖ అభ్యుదయ సినీ రచయిత, ప్రజా కళాకారుడు, కమ్యూనిస్టు నాయకుడు బొల్లిముంత శివరామకృష్ణ నవంబర్ 27, 1920 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా చదలవాడలో జన్మించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రచనలను, ఉద్యమాలను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. ఆయన రచనల్లో తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అన్యాయాలు, రైతుల కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినీ రచయితగా ‘నిమజ్జనం’కి జాతీయ అవార్డు లభించాయి.


