News August 17, 2025
సిరిసిల్ల: ’శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి’

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలోని గణేష్ మండపం నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమాచారం ద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీసులు ఆన్లైన్ ద్వారానే గణేష్ మండపాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
Similar News
News August 18, 2025
తిరుమలలో గందరగోళం జరగలేదు: TTD

తిరుమల క్యూలో గందరగోళం జరిగినట్లు వస్తున్న వార్తలను TTD ఖండించింది. వైరల్ అవుతోన్న వీడియో తోపులాటకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. భక్తులను సమూహాలుగా విభజించి తాళ్ల సాయంతో క్రమబద్ధీకరిస్తుండగా కొందరు ఉత్సాహంతో ముందుకు కదిలారని.. దాన్ని తోపులాట అని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. గత 3 రోజుల్లో 2.5 లక్షల మంది ఎలాంటి అంతరాయం లేకుండా స్వామివారిని దర్శించుకున్నారని వివరించింది.
News August 18, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ జితేష్ వి పాటిల్
✓పాల్వంచ బస్టాండ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
✓Way2News కథనానికి స్పందన.. సారపాకలో రోడ్లకు మరమ్మతులు
✓మణుగూరులో ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టిన డీసీఎం
✓భద్రాద్రి రామాలయంలో అన్నదానానికి రూ.లక్ష విరాళం
✓సీపీఐ నేత అయోధ్య సంస్మరణ సభలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే పాయం
✓పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు: సీపీఎం
News August 18, 2025
కాచాపూర్: బావిలో దూకి మహిళ ఆత్మహత్య

వ్యవసాయ బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపట్నం మండలం కాచాపూర్లో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్బు శకుంతల (58) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే మతిస్థిమితం కూడా కోల్పోయి ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.