News April 2, 2025
సిరిసిల్ల: శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

వేసవి క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి ఏ.రామదాసు తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్లలోపు బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 5 గంటల్లోపు కలెక్టరేట్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News January 9, 2026
9వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్!

తెలంగాణలోని 9,937 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సరఫరా వ్యవస్థలను సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹290Cr వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ఇంధన&పునరుత్పాదక ఇంధన విభాగాలు వచ్చే నెల నాటికి టెండర్లను ఖరారు చేయనున్నాయి. స్కూళ్లలో సౌర విద్యుత్ సరఫరా నెట్వర్క్ను అభివృద్ధి చేసే బాధ్యతను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు.
News January 9, 2026
‘పరాశక్తి’ విడుదలకు లైన్ క్లియర్.. U/A సర్టిఫికెట్

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్ బోర్డు ఇవాళ్టి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే ఆయా సన్నివేశాలను మేకర్స్ తొలగించడంతో తాజాగా సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో పరాశక్తి యథావిధిగా రేపు రిలీజ్ కానుంది.
News January 9, 2026
గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష: ఎస్పీ శబరీశ్

జిల్లాలో గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. గంజాయి సాగును అడ్డుకునేందుకు డ్రోన్ వ్యవస్థను వాడుతున్నామన్నారు. నరసింహులపేట మండలంలో వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారి సమాచారం పోలీసులకు అందజేయాలని ప్రజలను కోరారు.


