News February 8, 2025

సిరిసిల్ల: సమస్యలుంటే సంప్రదించాలి

image

రానున్న ఎండాకాలం, వానకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండటం కోసం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల సిస్ పరిపాలన సంచాలకులు విజయేందర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఆ యొక్క మండల ఏఈలకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.

Similar News

News September 14, 2025

HYD: కొడుకును చంపి మూసీలో పడేశాడు

image

HYDలోని బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అనాస్(3)ని తండ్రి మహమ్మద్ అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని ఏంతెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

News September 14, 2025

విజయవాడ: చెత్త ట్రాక్టర్‌లో తాగునీరు పంపిణీ

image

విజయవాడలోని న్యూ రాజేశ్వరిపేట కాలనీలో తాగునీటి సరఫరాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డయేరియా ప్రబలిన ఈ ప్రాంతంలో శనివారం ఉదయాన్నే తడి, పొడి చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్‌లలోనే మినరల్ వాటర్‌ను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల మరింతగా బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News September 14, 2025

HYD: కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

image

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.