News May 20, 2024
సిరిసిల్ల: 2 నెలల్లో 17 లక్షల పైచిలుకు బీర్లు తాగేశారు!
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సిరిసిల్ల జిల్లాలో రూ.85.22 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మార్చి 16న కోడ్ ప్రారంభం కాగా.. మే 17 వరకు (2నెలల్లో) 1,45,228 కేస్ల బీర్లు, 76,943 కేస్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేస్లో 12 సీసాలుంటాయి. ఎండల తీవ్రత దృష్ట్యా మద్యం కంటే చల్లని బీర్లకే మందుబాబులు మొగ్గు చూపారు. కోడ్ ఉన్నప్పటికీ JAN, FEB మాదిరిగానే విక్రయాలు సాగాయి.
Similar News
News October 3, 2024
కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.
News October 3, 2024
KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
News October 3, 2024
ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మానేరు డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.