News February 26, 2026

సిరిసిల్ల : 68 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటిరోజు 3814 మంది విద్యార్థులకు గాను 3746 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. 68 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Similar News

News March 1, 2026

రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

image

చలి, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 1, 2026

కలలో చీపురు కనిపిస్తే..

image

కలలు సాధారణం. అయితే అందులో చాలా వస్తువులు కనిపిస్తాయి. వాటిపై అనేక అపోహలుంటాయి. అందులో చీపురు ఒకటి. అది కనిపిస్తే అశుభమని భయపడతారు చాలామంది. కానీ అది పొరపాటని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ‘చీపురు లక్ష్మీదేవి స్వరూపం. కలలో చీపురు కనిపిస్తే దరిద్రం తొలగిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఇది జీవితంలో రాబోయే సానుకూల మార్పులకు సూచిక. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.

News March 1, 2026

ఇరాన్ అగ్రనాయకత్వాన్ని హతం చేశాం: ఇజ్రాయెల్

image

అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్, నెతన్యాహు వెల్లడించారు. రక్షణ మంత్రి అజీజ్, సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ షిరాజీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలీ షంఖానీ, IRGC చీఫ్ మహమ్మద్ పక్‌పౌర్, SPND ఛైర్మన్ హోస్సేన్ జబల్, SPND మాజీ ఛైర్మన్ మొజాఫరీ, అలన్బే కమాండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సలేహ్ అసాదీ హతమయ్యారు.