News March 14, 2026
సిరిసిల్ల: 8 మంది విద్యార్థులు గైర్హాజరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మొదటిరోజున ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాలలో 7307 మంది విద్యార్థులకు గాను 7299 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కన్నారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News March 27, 2026
చిత్తూరు: చెస్ ఆడుతారా..?

ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జిల్లాస్థాయి చెస్ పోటీలు జరగనున్నాయి. చిత్తూరులో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు www.apchess.org వెబ్సైట్ ద్వారా ఈనెల 29వ తేదీ లోపు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన ఇద్దరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.
News March 27, 2026
ఈ రామాలయాలు ప్రత్యేకం

రామాలయాల్లో లక్ష్మణుడు ఉండటం సహజం. కానీ కొన్ని క్షేత్రాల్లో రాముడు-సీత మాత్రమే కనిపిస్తారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని ఏకశిలా విగ్రహంపై సీతను ఒడిలో కూర్చోబెట్టుకున్న రాముడి రూపం కనిపిస్తుంది. దేశంలో ఇలా ఉన్న ఆలయం ఇదొకటేనని పండితులు చెబుతున్నారు. ఇక ఒంటిమిట్ట రామాలయంలో ఆంజనేయుడు ఉండడు. వనవాసంలో ఈ ప్రాంతాన్ని సీతారాములు సందర్శించారని, అప్పటికి హనుమంతుడు పరిచయం కాకపోవడంతో ఆయన విగ్రహం ఉండదట.
News March 27, 2026
భద్రాద్రి బార్ కౌన్సిల్ విజేతలు వీరే..!

భద్రాద్రి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ ముదల్కర్, ఉపాధ్యక్షురాలిగా షాజహాన్ పర్వీన్, ఉపాధ్యక్షుడిగా కాటూరి సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావు, సంయుక్త కార్యదర్శిగా గడదాసు నాగరాజు, గ్రంథాలయ కార్యదర్శిగా దొడ్డ ప్రసాద్, కోశాధికారిగా సంధ్యారాణి, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శులుగా దేవదాస్, ఉమ గెలుపొందారు. 328 ఓట్లకు గాను 309 ఓట్లు పోలయ్యాయి.


