News March 9, 2025
సిరిసిల్ల SP ఫుల్ డీటెయిల్స్

రాజన్న సిరిసిల్ల జిల్లా SPగా నియామకమైన మహేష్ బాబా సాహెబ్ గీతే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జన్మించారు. ఈయన అగ్రికల్చర్ BScలో డిగ్రీ పట్టాపొందారు. ఎలాంటి కోచింగ్ లేకుండానిరంతర సాధనతో 2020లో IPSకు ఎంపికయ్యారు. మొదట చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్ విధులు నిర్వహించారు. తర్వాత ఏటూరు నాగారం ASPగా పనిచేశారు. ప్రస్తుతం ములుగు జిల్లా OSDగా బాధ్యతలు నిర్వహిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా వచ్చారు.
Similar News
News January 6, 2026
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం దిక్సూచి: జనగామ కలెక్టర్

దిక్సూచి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జనగామ జిల్లా విద్యార్థుల ఆరోగ్య సమగ్రాభివృద్ధి దిశగా జరుగుతున్న దిక్సూచి (DIKSUCHI) కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు.
News January 6, 2026
కుంకుమ పువ్వు నుంచే ఏటా రూ.20 లక్షల ఆదాయం

ఏరోపోనిక్స్ విధానంలో తొలి విడతలో 450 గ్రాముల హై క్వాలిటీ కశ్మీరీ కుంకుమ పువ్వుల్ని సుజాతా అగర్వాల్ సాగు చేశారు. తర్వాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్పత్తి క్రమంగా పెరిగింది. ప్రస్తుతం ఏడాదికి ఒక్కో విడతకు కిలో చొప్పున 2 విడతల్లో 2 కేజీల కుంకుమ పువ్వు ఉత్పత్తి అవుతోంది. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ కావడంతో కిలోకు రూ.10 లక్షల చొప్పున ఏడాదికి రూ.20 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని సుజాతా వెల్లడించారు.
News January 6, 2026
రైతులకు బయోచార్పై ఉచిత శిక్షణ: కలెక్టర్ జితేష్

భద్రాద్రి జిల్లా రైతులకు పర్యావరణహిత సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ‘బయోచార్’ తయారీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నిపుణులు పరశురాం కైలాస్ అఖరే ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ శిబిరం సాగనుంది. నేడు ఉదయం 9:30 గంటలకు గరిమెల్లపాడులో బుధవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో జరుగుతుందన్నారు.


