News December 14, 2025

సిర్నాపల్లిలో దొంగ ఓటుకు యత్నం.. ఉద్రిక్తత

image

ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన ఓటును వేశాడు. విదేశాల్లో ఉండే మరో వ్యక్తి ఓటును వేసేందుకు మళ్లీ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించాడు. అయితే బూత్ ఏజెంట్లు, ఎన్నికల అధికారుల అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Similar News

News December 16, 2025

NZB: బాలుడి విక్రయం కలకలం.. తల్లితో సహా ముగ్గురి అరెస్ట్

image

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో 2 నెలల బాలుడి విక్రయం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వారికి రూ.2.40 లక్షలకు కన్న బిడ్డను తల్లి లక్ష్మీ హైదరాబాద్‌లో అమ్మగా పోలీసులకు బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లితో సహా విఠల్, రమాదేవి అనే ముగ్గురిని 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News December 16, 2025

NZB: తుది దశ ఎన్నికలకు రంగం సిద్ధం

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్ కు అధికారులు రంగం సిద్ధం చేశారు. మూడో విడుత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జర గనుంది. తుది విడుత పోలింగ్లో ఉన్న మొత్తం సర్పంచ్ స్థానాలు 165 కాగా ఇందులో 19 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు.

News December 15, 2025

NZB: ముగిసిన 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడతలో 12 మండలాల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం
సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలో గల గ్రామాలలో బుధవారం పోలింగ్ జరుగనుంది