News December 24, 2025
సిల్వర్ ఈజ్ ది న్యూ గోల్డ్.. ‘యాపిల్’ను వెనక్కు నెట్టి!

2025లో వెండి ధరలు రికార్డు స్థాయిలో పుంజుకుంటున్నాయి. అటు ఆర్థిక నిల్వగా, ఇటు పారిశ్రామిక లోహంగా వెండికి ఆదరణ పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం. తాజా లెక్కల ప్రకారం వెండి మార్కెట్ విలువ సుమారు $4.04 ట్రిలియన్లకు చేరుకుంది. దీంతో ‘APPLE’ కంపెనీ మార్కెట్ విలువ ($4.02 ట్రిలియన్లు)ను వెండి అధిగమించి మూడో స్థానానికి చేరింది. ఫస్ట్ ప్లేస్లో గోల్డ్ ($31.41T), రెండో స్థానంలో NVIDIA($4.61T) ఉంది.
Similar News
News December 25, 2025
ఇంటర్ సెకండియర్ HTపై ఫస్టియర్ మార్కులు

TG: ఇంటర్ సెకండియర్ పరీక్షల హాల్టికెట్పై ఇక నుంచి ఫస్టియర్ మార్కులు, పాస్/ఫెయిల్ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది. కొందరు విద్యార్థులు ఫస్టియర్ మార్కులు తక్కువొచ్చినా, సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా పేరెంట్స్కు చెప్పట్లేదు. రెండో ఏడాది చివర్లో ఇది తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనికి చెక్ పెట్టడంతో పాటు విద్యార్థుల్లో జవాబుదారీతనం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.
News December 25, 2025
నైతిక రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం!

దేశంలో నైతిక రాజకీయాలకు విలువ తెచ్చిన అజాతశత్రువు అటల్ బిహారి వాజ్ పేయి. ఒక్క ఓటుతో ప్రధాని పీఠం చేజారుతున్నా ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడని వ్యక్తిత్వం ఆయనది. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో హాస్య చతురత మేళవించిన ప్రసంగాలు, ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు. రోడ్లతో పాటు ఎయిర్, రైల్, టెలీ, షిప్ కనెక్టివిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ‘భారతరత్న’ అయ్యారు. ఇవాళ వాజ్పేయి జయంతి.
News December 25, 2025
ధనుర్మాసం: పదో రోజు కీర్తన

యోగనిద్రలో ఉన్న ఐదో గోపికను ఇతర గోపికలు ఇలా మేల్కొల్పుతున్నారు. ‘ఓ అమ్మా! తలుపు తీయకపోయినా పర్వాలేదు. కనీసం మా మాటలకు సమాధానమైనా ఇవ్వు. జ్ఞానుల మాటలు వినడం ఎంతో పుణ్యం. పరిమళభరిత తులసిమాలలు ధరించే నారాయణుడు మన వ్రతానికి ఫలితాన్నిస్తాడు. రాముడి చేతిలో హతుడైన కుంభకర్ణుడు తన నిద్రను నీకేమైనా ఇచ్చాడా? ఆలస్యం చేయక నిద్ర వీడి, మాతో కలిసి వ్రతాన్ని పూర్తి చేయి’ అని వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>


