News March 7, 2026

సివిల్స్‌లో జగిత్యాల జిల్లా వాసికి 748వ ర్యాంకు

image

జగిత్యాల మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి మల్లేశం-గంగాలక్ష్మీ దంపతుల కుమారుడు రాహుల్ సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచాడు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఆయన 748వ ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. రాహుల్ విజయంతో హన్మాజీపేటలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు ఆయన ఇంటికి చేరుకుని పేరెంట్స్‌కు అభినందనలు తెలిపారు.

Similar News

News March 8, 2026

భారత్ దెబ్బకు స్వరం మార్చిన అమెరికా!

image

ఆయిల్ విషయంలో అమెరికా స్వరం మారింది. రష్యా చమురు కొనేందుకు భారత్‌కు ‘మినహాయింపు’ ఇస్తున్నామన్న అగ్రరాజ్యం ఇప్పుడు సాఫ్ట్ టోన్ అందుకుంది. భారత్ <<19321716>>ఘాటుగా రిప్లై<<>> ఇవ్వడమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు పెరిగితే తమ దేశంలోనూ ధరలు పెరుగుతాయన్న భయం అమెరికాను దారిలోకి తెచ్చినట్లుంది! అందుకే ‘మినహాయింపు’ స్థానంలో ‘ఇంధన స్థిరత్వం కోసం పార్ట్‌నర్స్‌తో కలిసి పని చేస్తున్నాం’ అని కొత్త రాగం అందుకుంది.

News March 8, 2026

‘రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్’

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై పూర్తి వివరాలతో కూడిన అర్జీలను సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. మధ్యాహ్నం వరకు సాగే ఈ వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 8, 2026

ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు: సీఎం

image

AP: తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా లక్ష్యాన్ని సాధించే వరకు వదిలిపెట్టరని CM CBN కొనియాడారు. అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘డ్వాక్రా మహిళల ఉత్పత్తుల కోసం తీసుకొచ్చిన స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తా. అప్పులు ఇప్పించే బాధ్యత నాది.. సద్వినియోగం చేసుకోవడం మీ పని. ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష దాటారు. ఏడాదిలో మరో 5L మందిని తయారుచేస్తాం’ అని పేర్కొన్నారు.