News March 7, 2026
సివిల్స్లో సత్తా చాటిన మెతుకు జిల్లా వాసి

UPSC ప్రకటించిన ఫలితాల్లో మనోహరాబాద్(M) పోతారానికి చెందిన కుమ్మరి శ్రావణ్కుమార్ ప్రతిభ చాటారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన యాదగిరి-జ్యోతిల కుమారుడైన శ్రావణ్.. జాతీయ స్థాయిలో 768వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. బీటెక్ పూర్తి చేసిన ఆయన, ఇప్పటికే రాష్ట్ర స్థాయి గ్రూప్-1లో శిక్షణలో ఉన్నారు. సివిల్స్లోనూ విజయం సాధించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 8, 2026
భారత్ దెబ్బకు స్వరం మార్చిన అమెరికా!

ఆయిల్ విషయంలో అమెరికా స్వరం మారింది. రష్యా చమురు కొనేందుకు భారత్కు ‘మినహాయింపు’ ఇస్తున్నామన్న అగ్రరాజ్యం ఇప్పుడు సాఫ్ట్ టోన్ అందుకుంది. భారత్ <<19321716>>ఘాటుగా రిప్లై<<>> ఇవ్వడమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరిగితే తమ దేశంలోనూ ధరలు పెరుగుతాయన్న భయం అమెరికాను దారిలోకి తెచ్చినట్లుంది! అందుకే ‘మినహాయింపు’ స్థానంలో ‘ఇంధన స్థిరత్వం కోసం పార్ట్నర్స్తో కలిసి పని చేస్తున్నాం’ అని కొత్త రాగం అందుకుంది.
News March 8, 2026
‘రేపు కలెక్టరేట్లో PGRS, రెవెన్యూ క్లినిక్’

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై పూర్తి వివరాలతో కూడిన అర్జీలను సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. మధ్యాహ్నం వరకు సాగే ఈ వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News March 8, 2026
ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు: సీఎం

AP: తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా లక్ష్యాన్ని సాధించే వరకు వదిలిపెట్టరని CM CBN కొనియాడారు. అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘డ్వాక్రా మహిళల ఉత్పత్తుల కోసం తీసుకొచ్చిన స్వయం బ్రాండ్ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తా. అప్పులు ఇప్పించే బాధ్యత నాది.. సద్వినియోగం చేసుకోవడం మీ పని. ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష దాటారు. ఏడాదిలో మరో 5L మందిని తయారుచేస్తాం’ అని పేర్కొన్నారు.


