News June 19, 2024
సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ కు ఉచిత శిక్షణకు దరఖాస్తు

2024-25 సంవత్సరానికై షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ హైద్రాబాద్ లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ (పదినెలలు)ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందిని రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన వారు ఆన్ లైన్ ద్వారా జూలై 10వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 2, 2026
మజ్లిస్ మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కదు: అసదుద్దీన్

నల్గొండలో ఎంఐఎం మద్దతు లేనిదే మేయర్ పీఠం దక్కదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ భూములను అక్రమార్కుల నుంచి కాపాడిన ఘనత తమదేనని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని, తమ అనుమతి లేకుండా అధికారం దక్కదని ధీమా వ్యక్తం చేశారు.
News February 1, 2026
మిర్యాలగూడకు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రచార హోరు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా సీఎం స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే స్థానిక నేతలు సభకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
News February 1, 2026
NLG: పెన్షన్ కోసం టెన్షన్..

ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో జాప్యం చేయడంతో జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అన్ని రకాల పెన్షన్లు కలిపి సుమారు 2.04 లక్షలు ఉండగా, వీటి పంపిణీకి నెలకు సుమారు రూ. 47.34 కోట్ల నిధులు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం డిసెంబర్, జనవరికి సంబంధించిన పెన్షన్లు ఇంకా పంపిణీ కాకపోవడంతో పెన్షన్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


