News March 3, 2026

సీఎంతో సమీక్షలో పాల్గొన్న ములుగు కలెక్టర్

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో మంగళవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాల పురోగతిని సీఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్య, మధ్యాహ్న భోజన పథకాలపై కలెక్టర్లతో చర్చించినట్లు సమాచారం.

Similar News

News April 13, 2026

తూప్రాన్: తల్లిదండ్రులకు విజయాన్ని అంకితం చేసిన శ్రావణి

image

తూప్రాన్ ఎంజేపీ బాలికల కళాశాల విద్యార్థిని శ్రావణి ఇంటర్ ఎంపీసీలో 950 మార్కులతో సత్తా చాటింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. టెన్త్ బోనాల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసిన శ్రావణి.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్‌లో రాణించింది. తన విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని శ్రావణి పేర్కొంది.

News April 13, 2026

సిద్దిపేట TSRSలో 100 శాతం ఉత్తీర్ణత

image

సిద్దిపేట జిల్లా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించింది. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి పరీక్షలు రాసిన మొత్తం 159 మంది విద్యార్థులు పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సెకండియర్‌లో అర్చన 1000కి 994 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.

News April 13, 2026

నేడు RRతో SRH ఢీ.. పరుగుల వరద ఖాయం!

image

IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి RR దూకుడు మీద ఉంది. పైగా వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ చెలరేగి ఆడుతున్నారు. మరోవైపు SRH 4 మ్యాచుల్లో 3 ఓటములు చవిచూసింది. నేటి మ్యాచులో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.