News July 6, 2024

సీఎంల భేటీకి మంత్రి అనగాని సత్య ప్రసాద్

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్ సమావేశానికి హాజరవుతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఏపీ సీఎస్‌, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు భేటీకి వెళ్లనున్నారు. చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే 10 అంశాలను సిద్ధం చేసుకున్నాయి.

Similar News

News September 30, 2024

గుంటూరు: నేటి నుంచి ఇళ్లకు ఉచిత ఇసుక

image

గృహాలు నిర్మించుకునే వారికి సోమవారం నుంచి గంగా ఇసుక అందుబాటులో ఉండనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని నగదు చెల్లించి అప్లై చేసుకున్న వారికి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పారు. సొంత వాహనం కలిగిన వారికి స్లాట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనం లేని వారికి ప్రభుత్వమే సమకూరుస్తుందని, వినియోగదారులు రవాణా చార్జీలు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.

News September 30, 2024

మంగళగిరి: నేడు ప్రయోగాత్మకంగా నైపుణ్య గణన

image

మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నైపుణ్య గణనను నైపుణ్యాభివృద్ధి సంస్థ సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఈ మేరకు సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత ఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఒక్కో గ్రామవార్డు సచివాలయం పరిధిలో 6గురు ఉద్యోగులు పనిచేస్తారని, వారు ఇంటింటికీ వెళ్లి 25 రకాల ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించి ట్యాబ్లో నమోదు చేస్తారు.

News September 30, 2024

గుంటూరులో యువకుడిపై కత్తితో దాడి

image

గుంటూరులో ఆదివారం రాత్రి ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. RTCకాలనీకి చెందిన ఖాసీం మందులు కొనడానికి రాత్రి రామిరెడ్డి తోటలోని ఓ మెడికల్ షాప్‌కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి మద్యం తాగి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖాసీంతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఖాసీం దాడి చేశాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం GGHకు తరలించారు.