News July 3, 2024
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719982276622-normal-WIFI.webp)
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ను సీఎం కార్యాలయం వెల్లడించింది. ఉదయం 11.00 గంటలకు సచివాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 03.00 గంటలకు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు.
సాయంత్రం 05.00 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారని సీఎం కార్యాలయం తెలియజేసింది.
Similar News
News July 5, 2024
మహిళా అథ్లెట్లు ఒలింపిక్స్కు ఎంపికవడం గర్వంగా ఉంది: నారా లోకేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720181058464-normal-WIFI.webp)
ఏపీకి చెందిన మహిళా అథ్లెట్లు 2024 పారిస్ ఒలింపిక్స్కు ఎంపికవడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కొన్నేళ్లుగా దండి జ్యోతికశ్రీ, యర్రాజి జ్యోతి పడిన కష్టానికి మంచి అవకాశం లభించిందన్నారు. కృషి, పట్టుదలతో వారు కచ్చితంగా ఒలింపిక్ మెడల్ అందుకోవాలనే కలను నెరవేర్చుకుంటారన్నారు. ఒలింపిక్స్లో మంచి ప్రదర్శన కనబరిచి ఏపీ ప్రజలు గర్వపడేలా చేయాలని లోకేశ్ ఆకాంక్షించారు.
News July 5, 2024
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి ప్రాణదానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720162506569-normal-WIFI.webp)
రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకొచ్చారు. మంగళగిరికి చెందిన న్యాయవాది ప్రసాద్కు 2రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరగగా NRI ఆసుపత్రికి తరలించారు. కాగా వైద్యులు ప్రసాద్కు బ్రెయిన్ డెడ్గా నిర్థారించారు. అతని అవయువాలను శుక్రవారం మధ్యాహ్నం NRI నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తిరుపతికి తరలించనున్నారు.
News July 5, 2024
గుంటూరు: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720134589582-normal-WIFI.webp)
వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకి చెందిన కౌలు రైతు రాణాప్రతాప్ (34) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 3 సంవత్సరాలుగా మృతుడు మిర్చి సాగు చేస్తున్నాడని, పంటలపై రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేక ప్రతాప్ జూన్ 29న పురుగు మందు తాగాడన్నారు. బంధువులు గుంటూరు GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు పోలీసులు నమోదు చేశారు.