News August 2, 2024
సీఎం చంద్రబాబు మడకశిర పర్యటన హైలైట్స్
★ గుండుమల గ్రామంలో ఓబుళమ్మ, రామన్న అనే వృద్ధుడికి పింఛన్ పంపిణీ
★ ఓబుళమ్మకు ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశం
★ రామన్న కుమారుడికి స్థానికంగా ఉద్యోగ అవకాశం
★ డ్రిప్ ఇరిగేషన్ పథకం త్వరలో ప్రారంభం
★ వర్షంలోనే సీఎం 45 నిమిషాల ప్రసంగం
★ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వినతి.. మడకశిర నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి హామీ
★ సీపీఐ నాయకుల ముందస్తు అరెస్ట్.. లోకేశ్ క్షమాపణ
Similar News
News September 30, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి అమ్మాయి
తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
News September 30, 2024
వరద బాధితులకు తాడిపత్రికి చెందిన సంస్థ రూ.కోటి విరాళం
తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ మూర్తి సీఎం చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు.
News September 30, 2024
సీడ్ యాప్ రాష్ట్ర ఛైర్మన్గా రాయదుర్గం వాసి
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ నూతన ఛైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. రాయదుర్గం పట్టణానికి చెందిన ఆయన విజయవాడలోని డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.