News November 9, 2025

సీఎం చేతికి తిరువూరు నివేదిక.. చంద్రబాబు ఏమన్నారంటే..!

image

విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ల వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు నివేదిక, పెన్ డ్రైవ్‌ను అందించారు. నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ పంచాయితీపై తన వద్ద కూడా సమగ్ర నివేదిక ఉందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. త్వరలో ఇద్దరు నేతలను పిలిపించి మాట్లాడతానని ఆయన వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

Similar News

News November 9, 2025

సింగ‌రేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

image

సింగ‌రేణి సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఇంట‌ర్న‌ల్ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త అందింది. సంస్థ‌లో ఖాళీగా ఉన్న ప‌లు ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ను అంతర్గత అభ్యర్థుల‌తో భ‌ర్తీ చేసేందుకు యాజమాన్యం స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. అర్హత గల ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 24వ తేదీ లోగా ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాలని, సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరింది.

News November 9, 2025

మల్కాపురంలో యువకుడి మృతి

image

మల్కాపురంలోని ఓ బార్‌లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్‌ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 9, 2025

కామారెడ్డి: అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

image

కామారెడ్డి జిల్లాలో వివిధ విత్తనాల క్రిమిసంహారక మందుల కంపెనీల్లో పని చేసే మార్కెట్ ఉద్యోగులు అందరూ కలసి కార్యవర్గం ఎన్నుకున్నారు. 40 మంది సభ్యులతో యూనియన్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నగేష్, ఉపాధ్యక్షుడిగా అనిల్, క్యాషియర్ ప్రణయ్, కార్యదర్శిగా నాగరాజులను నియమించారు. మార్కెట్ రంగాల్లో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక ఇబ్బదులు ఎదుర్కొని అందరూ కలిసికట్టుగా ఉండాలని వారు సూచించారు.