News April 18, 2024
సీఎం జగన్ నాకు తీరని అన్యాయం చేశాడు: వెలగపల్లి

సీఎం జగన్ తనకు తీరని అన్యాయం చేశాడని తిరుపతి పార్లమెంటు బిజెపి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. వాకాడులో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎంపీగా, ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను.. ఎవరో మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. దీంతో తాను బీజేపీ తరఫున తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అన్నారు. తనను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు.
Similar News
News October 9, 2025
టపాసుల గోదాములపై తనిఖీలు చేపట్టండి: కలెక్టర్

రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం లైసెన్సు పొందినవారే బాణసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
News October 9, 2025
10న వెంకటాచలం రానున్న CM..

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.
News October 8, 2025
నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ఓపెనింగ్ ఎప్పుడో..?

పొదుపు మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నెల్లూరులో పైలట్ ప్రాజెక్టుగా <<17847829>>స్మార్ట్ స్ట్రీట్<<>> ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో చాలా రోజుల కిందటే అక్కడి దుకాణాల ముందు భాగాలను తొలగించారు. కంటైనర్లతో స్మార్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. దసరా తర్వాత ప్రారంభించాలని 4వ తేదీన ముహూర్తం కుదిర్చారు. ఏమైందో ఏమో ఓపెనింగ్ను మర్చిపోయారు. వీటిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో చూడాలి మరి.