News April 10, 2024
సీఎం జగన్ బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేటి నుంచి యథావిధిగా కొనసాగనుంది. ఇవాళ పల్నాడు జిల్లా గంటవారిపాలెం నుంచి ఆయన ఉ.9కి బయల్దేరుతారు. పుట్టావారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. భోజనం అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సా.3:30కి అయ్యప్పనగర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ధూళిపాళ్లలో బస చేస్తారు.
Similar News
News February 15, 2026
‘ఫుడ్ జిహాద్’ పేరుతో వేధిస్తారా.. ఒవైసీ ఆగ్రహం

TG: మేడారం జాతరలో కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని వేధించిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. వ్యూస్ కోసం పేద వ్యాపారిని అవమానించడం, మత రంగు పులిమి వేధించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం రూ.10కి కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని ‘ఫుడ్ జిహాద్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
News February 15, 2026
ఘనవిజయం.. సూపర్-8లోకి వెస్టిండీస్, ఇంటికి నేపాల్

T20WC: నేపాల్పై వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత నేపాల్ 20 ఓవర్లలో 133/8 రన్స్ చేసింది. దీపేంద్ర సింగ్ ఒక్కడే 58 పరుగులతో రాణించారు. అనంతరం విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ హోప్ (61*), హెట్మెయిర్ (46*) రాణించారు. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-C నుంచి సూపర్-8కి వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. అటు నేపాల్ ఎలిమినేట్ అయింది.
News February 15, 2026
నిష్కల్మష భక్తికి నిలువుటద్దం ‘భక్త కన్నప్ప’

శ్రీకాళహస్తి అడవుల్లో తిన్నడు అనే బోయవాడు శివుని భక్తుడు. అమాయక భక్తితో శివలింగానికి నోటి నీటితో అభిషేకం చేసి, వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అతని భక్తిని లోకానికి చాటాలని శివుడు లింగం కంటి నుంచి రక్తం కార్చాడు. దీంతో తిన్నడు తన కంటిని పెకిలించి దేవునికి అర్పించాడు. రెండో కన్ను కూడా రక్తం కారగా రెండో కంటిని తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమై అతడిని ఆపి కన్నప్పగా దీవించి మోక్షం ప్రసాదించాడు.


