News November 30, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన తుమ్మల

కొత్తగూడెంలో సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం రోజు పరిశీలించారు. డిసెంబర్ 2న మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ, ఎమ్మెల్యేలు కూనంనేని, జారే, పాయం లతో కలిసి ఏర్పాట్ల సమీక్ష, సూచనలు చేశారు.
Similar News
News December 1, 2025
NGKL జిల్లాలో తగ్గిన చలి

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.1°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 18.3°C, తోటపల్లిలో 18.5°C, ఊర్కొండ, వెల్దండలలో 18.6°C, తాడూరులో 18.7°C, చారకొండ మండలంలో 18.8°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News December 1, 2025
లైంగిక వేధింపులు.. హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ‘దూరపు బంధువు మయాంక్తో అచలకు స్నేహం ఏర్పడింది. డ్రగ్స్కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి, మానసికంగా వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్పై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.
News December 1, 2025
వీటిపై తిరుపతి, చిత్తూరు MPలు మాట్లాడేనా..?

కడప-రేణిగుంట హైవే నిర్మాణానికి ఫారెస్ట్ శాఖ అనుమతులు ఇచ్చినా వర్కింగ్ పర్మిషన్ ఇంకా రాలేదు. ఇటీవల కళత్తూరు హరిజనవాడలో చెరువు తెగి అందరూ నష్టపోగా సరైన సాయం అందలేదు. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుపై అడుగులు పడలేదు. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై తిరుపతి, చిత్తూరు MPలు గురుమూర్తి, ప్రసాదరావు గళమెత్తుతారా? లేదా?


