News April 11, 2025
సీఎం పర్యటన ట్రయల్ రన్.. నిలిచిపోయిన ట్రాఫిక్

సీఎం కడప జిల్లా పర్యటన కోసం గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేశారని ప్రయాణికుల ఆరోపించారు. తిరుపతి నుంచి కడపకు వచ్చే మార్గంలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాని పేర్కొన్నారు. ఒంటిమిట్టకు సీఎం రానున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. రాములోరికి ఆయన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.
Similar News
News April 18, 2025
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వేంపల్లి చెందిన సుబ్రహ్మణ్యంను పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు నియామక ధ్రువపత్రాన్ని ఆయనకు మాజీ ఎంపీ తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు సూచించారు.
News April 18, 2025
కడప – రాయచోటి రోడ్డుపై యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

రామాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా కడప – రాయచోటి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలం గొల్లపల్లికి చెందిన పప్పిరెడ్డి ఇరగం రెడ్డి మృతిచెందారు. ద్విచక్రవాహనంలో రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీ కొట్టింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News April 18, 2025
వేంపల్లెలో బాలికపై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

వేంపల్లెలో ఓ బాలికను ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితులు ఫాజిల్, ఆనంద్ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా నిందుతులకు రిమాండ్ విధించగా కడప సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.