News July 9, 2025
సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం

సీఎం పర్యటనకు బందోబస్తుగా వచ్చిన పోలీసులకు ఎస్పీ వి.రత్న దిశానిర్దేశం చేశారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కొత్తచెరువులో గురువారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీసులు సూచించారు.
Similar News
News July 10, 2025
విశాఖలో గ్లోబల్ క్యాబబులిటీ సెంటర్ ఏర్పాటు

విశాఖ కేంద్రంగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఇసాయ్ ఫార్మా గ్లోబల్ క్యాబబులిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం విశాఖలోని ఐటీ మౌలిక సదుపాయాలను సంస్థ నిపుణుల బృందం పరిశీలించింది. విశాఖ ఎంపీ శ్రీభరత్కు తమ ప్రణాళికలను ఇసాయ్ ఫార్మా గ్లోబల్ CEO మెుకోటో హోకేట్సు వివరించారు.
News July 10, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
☞ గుడివాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం
☞ వీరవల్లి: మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
☞ మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పీఏసీఎస్లకు త్రిసభ్య కమిటీలు
☞ మచిలీపట్నం: మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ రాజా హెచ్చరికలు
☞ కనకదుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు
News July 10, 2025
ప్రతి చిన్నారికి ఆధార్ నమోదు చేయాలి: ఇంఛార్జి పీవో

ప్రతి చిన్నారికి తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయాలని ఐటీడీఏ ఇంఛార్జి పీఓ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో గ్రామ సచివాలయం, ఐసీడీఏస్ ఇతర అధికారులతో చిన్నారులకు ఆధార్, జనన దృవీకరణ పత్రాల జారీపై సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో 4,765 మంది పిల్లలకు ఆధార్ కార్డులు, 3,484 మందికి జనన దృవీకరణ పత్రాలు లేవన్నారు. ఈ నెలాఖరులోగా ఆధార్ జారీ చేయాలని సూచించారు.