News March 25, 2025
సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

హుజూర్ నగర్లో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక అధికారులు సభా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.
Similar News
News December 26, 2025
సంక్రాంతి సెలవులు ఖరారు

ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జనవరి 19న(సోమవారం) తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. కాలేజీల సెలవుల గురించి ప్రకటన రావాల్సి ఉంది. అటు తెలంగాణలోనూ స్కూళ్లకు ఇవే తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
News December 26, 2025
మామిడి చెట్లపై చెదను ఎలా నివారించాలి?

మామిడిలో NOV-డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్ని పూతగా పూయాలి.
News December 26, 2025
రైల్వే ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమల్లోకి

రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల <<18630596>>ధరలు<<>> నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్ క్లాస్లో 215KM లోపు జర్నీపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆపై ప్రయాణం చేసేవారికి ప్రతి KMకు పైసా చొప్పున, మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ AC, AC తరగతుల్లో ప్రతి KMకు 2 పైసల చొప్పున పెంచారు. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో మార్పులు లేవు. ఈ మేరకు రైల్వే నోటిఫై చేసింది. ఈ ఏడాదిలో ఛార్జీలను 2 సార్లు పెంచింది.


