News March 16, 2025

సీఎం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు: MP కావ్య

image

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి పదంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. నియోజకవర్గానికి రూ.800 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. 2029లో రాహుల్ గాంధీ పీఎం అవుతారన్నారు.

Similar News

News March 17, 2025

అనంతపురం: డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ అరెస్ట్

image

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వెంకటపతికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్ట్‌‌లో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ వెంకటపతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సీఐ తెలిపారు.

News March 17, 2025

నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. ALL THE BEST

image

AP: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్ష ఉంటుంది. ఉ.8.45 గం. నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. 6.49 లక్షల మంది విద్యార్థుల కోసం 3,450 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
*Way2News తరఫున ALL THE BEST

News March 17, 2025

కాకినాడ: మానవత్వం మరిచి తల్లిని హత్య చేసిన కొడుకు

image

నేటి సమాజంలో మానవత్వం మంట కలుస్తోంది. తల్లిని హత్య చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ రూరల్ ఎస్.అచ్యుతాపురానికి చెందిన జహీరా బీబీ (55)పై చిన్న వివాదంతో ఆదివారం ఆమె కొడుకు షబ్బీర్ కమల్ దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలానికి రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలం ఎస్సై వీరబాబు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!