News June 28, 2024

సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి: DMHO సుహాసిని

image

ప్రజలు ఇంటితో పాటు, పరిసరాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సుహాసిని ప్రకటనలో తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తుగా తీసుకునే చర్యల గురించి వివరిస్తున్నామన్నారు. బయట ఆహారాలు తినకుండా, ఇంట్లో తయారు చేసిన వేడి వేడి ఆహారం తీసుకుంటే మంచిదన్నారు.

Similar News

News July 3, 2024

విజయవాడ: ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యం

image

ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఆర్ఎం నరేంద్ర, ఆనందరావు, పాటిల్ కోరారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్, ఆదాయపు పన్ను శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయ సేకరణ కీలకమని చెప్పారు.

News July 3, 2024

మైలవరం: పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం

image

పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్‌ సోమవారం 43 మందికి పింఛన్‌లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.

News July 3, 2024

విజయవాడ: దేవదాయశాఖ అధికారిణి సస్పెండ్

image

ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణి కె శాంతిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణినిగా ఉన్న ఈమెను బాధ్యతల నుంచి తొలగించగా, తాజాగా ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కృష్ణా జిల్లాకు సంధ్యా, ఎన్టీఆర్ జిల్లాకు సీతారావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు.