News June 29, 2024

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం: డా.మాలతి

image

వర్షాకాలం వ్యాధులు వ్యాపించే సమయం ఆసన్నమైందని , జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసి అమలు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.మాలతి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో రాఫిడ్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మందుల కొరత లేదని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Similar News

News July 8, 2024

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

News July 8, 2024

ఆదాయం దండిగా వస్తున్నా.. ఇంకా అద్దె భవనాల్లోనే!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినెల పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు సొంత స్థలాలు ఉన్నా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సొంత భవనాలు సమకూరుతాయని, ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

News July 8, 2024

ఖమ్మం మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.