News October 8, 2025
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. జిల్లాలో తరచుగా వర్షాలు కురుస్తున్నాయని, వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ప్రజలు తమ చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీటిని వేడి చేసి తాగాలని సూచించారు. ప్రతినిత్యం చేతులను సబ్బుతో కడుక్కోవాలన్నారు.
Similar News
News October 9, 2025
ఆ లక్ష్య సాధనకు టీచర్ల సహకారం అవసరం: లోకేశ్

AP: టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మ్యూచువల్, స్పౌజ్ బదిలీలతో పాటు భాషా పండితులకు పదోన్నతులు దక్కిన నేపథ్యంలో ఆయన్ను పలువురు టీచర్లు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విద్యాశాఖలో తొలి ఏడాది సంస్కరణలు పూర్తి చేశాం. వచ్చే నాలుగేళ్ల పాటు ఫలితాలపైనే దృష్టిసారిస్తాం. విద్యావ్యవస్థను నం.1గా తీర్చిదిద్దాలనేదే లక్ష్యం. ఇందుకు టీచర్ల సహకారం కావాలి’ అని అన్నారు.
News October 9, 2025
ఇండియన్స్ ఎందుకు క్లీన్గా ఉండరు: నటి

ముంబైలోని జుహు, బ్రెజిల్లోని రియో బీచ్లను పోల్చుతూ నటి, వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇన్స్టాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘జుహు కంటే రియో బీచ్ కిక్కిరిసిపోయింది. ఇంతమంది ఉన్నా ఎంత క్లీన్గా ఉంది. ఇండియన్స్ ఎందుకు క్లీన్గా ఉండరు?’ అని ఓ వీడియో షేర్ చేసింది. ఇండియన్స్ను అవమానించారంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. ‘తను చెప్పిన దాంట్లో తప్పేముంది. ముందు మనం మారాలి’ అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
News October 9, 2025
తెలుగు టైటాన్స్ ‘తగ్గేదేలే’.. వరుసగా ఐదో విజయం

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు హరియాణా స్టీలర్స్తో మ్యాచులో 46-29 తేడాతో విక్టరీ సాధించింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో 8 గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో భరత్ 20, విజయ్ మాలిక్ 8 పాయింట్లు సాధించారు. పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ, పుణెరి పల్టాన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.