News December 15, 2025
సీడ్ పార్కు… 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలు

TG: విత్తన ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా సీడ్ రీసెర్చ్ పార్కు నెలకొల్పనుంది. అలాగే కొత్తగా 100 విత్తన ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 25 లక్షల టన్నుల అధిక నాణ్యత గల విత్తనాలను ఉత్పత్తి చేయనుంది. ఎగుమతి కోసం ‘Inland seed Export facilitation port’నూ నెలకొల్పనున్నట్లు TG రైజింగ్ డాక్యుమెంట్లో తెలిపింది.
Similar News
News December 19, 2025
మరోసారి అట్టుడుకుతున్న బంగ్లా

బంగ్లాదేశ్లో హాదీ <<18610392>>మృతితో<<>> ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పంటించగా అర్ధరాత్రి బంగ్లా బగబంధు ముజిబుర్ రెహ్మాన్ ఇంటిని తగలబెట్టారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లను ధ్వంసం చేశారు. తాజా ఘటనలు ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లను తలపిస్తున్నాయి. అప్పుడు కూడా ముజిబుర్ ఇంటిపై దాడి జరిగింది.
News December 19, 2025
నిన్ను నువ్వు ఉత్తమంగా మార్చుకోవాలంటే?

ఎవరైనా మనల్ని ఆలస్యంగా ఆహ్వానిస్తే తిరస్కరించడం, పిలవని చోటుకు వెళ్లకపోవడం ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఎదుటివారు మనల్ని మర్చిపోతే వారిని వదిలేయాలి. మనల్ని వాడుకోవాలని చూస్తే హద్దులు పెట్టుకోవాలి. మోసపోయినప్పుడు క్షమించి ముందుకు సాగాలి. అవమానించిన వారికి విజయంతో జవాబు చెప్పాలి. మన విలువ గుర్తించని వారికి దూరం ఉండాలి. తక్కువ అంచనా వేసేవారికి ఫలితాలతో సమాధానమివ్వాలి. తద్వారా గుర్తింపు లభిస్తుంది.
News December 19, 2025
రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్: మంత్రి లోకేశ్

AP: టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వాతోపాటు రహేజా ఐటీ పార్క్కు వ్యతిరేకంగా వైసీపీ పిల్స్ దాఖలు చేసిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. యువత భవిష్యత్తు పట్ల జగన్కు ఎందుకింత ద్వేషం అని Xలో ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి అడుగులోనూ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.


