News April 6, 2025

సీతంపేట: ఆటో బోల్తా.. ఒకరి మృతి

image

సీతంపేట పరిధిలో ఇసుకగెడ్డ వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వెలగవాడకి చెందిన గొట్టపు లక్ష్మణరావు (36) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సకాలంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వలనే చనిపోయాడని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సీతంపేట ఎస్‌ఐ అన్నంరావు కేసు నమోదు చేశారు.

Similar News

News December 23, 2025

అధికారులే అన్నీ చూసుకున్నారు.. సిట్ ప్రశ్నలపై చెవిరెడ్డి!

image

AP: తిరుమల కల్తీ నెయ్యి విషయంలో SIT ప్రశ్నలకు YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరైన జవాబు ఇవ్వలేదని తెలుస్తోంది. టెండర్ రూల్స్‌లో మార్పులపై ప్రశ్నించగా, అధికారులే చూసుకున్నారని చెప్పినట్లు సమాచారం. వారు చెబితేనే కొనుగోలు కమిటీ సిఫార్సులు ఆమోదించానని అన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న చెవిరెడ్డిని SIT 4గంటలపాటు విచారించింది. అప్పట్లో TTD కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఆయన ఉన్నారు.

News December 23, 2025

అన్నవరంలో ఆరుగురు పురోహితులపై వేటు

image

అన్నవరం సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసిన ఆరుగురు వ్రత పురోహితులపై వేటు పడింది. ఈ నెల 21న పాలకొల్లులో నిర్వహించిన వ్రతాల్లో ఈ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఈఓ త్రినాథరావు ఈ చర్యలు తీసుకున్నారు. ఒక గుమస్తాకు నోటీసు జారీ చేశారు. మంత్రి రామానాయుడు సిఫార్సుతో ఈ వ్రతాలు జరిగిన విషయం తెలిసిందే.

News December 23, 2025

కర్నూలు: శరీరం నుజ్జునుజ్జు

image

ఆదోని మండలం ఆరేకల్లు మెడికల్ కాలేజీ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహంపై భారీ వాహనాలు వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. మృతుడికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.