News April 17, 2024
సీతమ్మ కుడి వైపు ఉన్న ఆలయం ఎక్కడ ఉందో తెలుసా

తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం క్రీస్తు పూర్వం 1402లో నరసింహ మొదలియార్ నిర్మించారు. ఇక్కడ సీతమ్మ రాముల వారికి కుడి వైపున, లక్ష్మణుడు ఎడమవైపున దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారిని పోలిన విధంగా రాముడు దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలలో కూడా ఇలాగే సీతమ్మ కుడి వైపు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయానికి ఎదురుగా ప్రసన్న ఆంజనేయస్వామి వారు కొలువై ఉన్నారు.
Similar News
News April 23, 2025
సివిల్స్లో మెరిసిన పలమనేరు వాసి

UPSC తుది ఫలితాలలో చిత్తూరు జిల్లా వాసి సత్తా చాటాడు. పలమనేరుకు చెందిన రంపం శ్రీకాంత్ మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 904వ ర్యాంకు సాధించాడు. శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడంతో జిల్లా వాసులు అతనికి అభినందనలు తెలిపారు.
News April 23, 2025
చిత్తూరు: నేడే 10 ఫలితాల విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా నేడు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది పరీక్షలు రాసిన 21,245 మంది విద్యార్థుల భవిష్యత్తు నేడు తేలనుంది. ఫలితాల విడుదలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 21,245 మంది పరీక్ష రాయగా వారిలో 294 మంది ప్రైవేట్గా, 20,951 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాశారు.
News April 23, 2025
ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించినట్లు చిత్తూరు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిస్వరన్ తెలిపారు. మంగళవారం ఫీజు కట్టడానికి చివరి రోజు కాగా ఇంటర్ బోర్డు శుక్రవారం వరకు ఫీజు గడువు తేదీని పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.