News March 29, 2025

సీతానగరం: వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

image

బొబ్బిలి మండలం కేశాయివలస సమీపంలో పోడు భూములలో మొక్కలకు నీరు పోస్తుండగా శుక్రవారం ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో సీతానగరం(M) కాశయ్యపేట చెందిన డ్రైవర్ పి.పోలిరాజు(56) అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణ సీఐ సతీశ్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 31, 2025

HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

image

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.

News March 31, 2025

HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

image

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.

News March 31, 2025

ఇరగదీసిన కొత్త కుర్రాడు

image

కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ ఇరగదీశాడు. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 24 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. IPL డెబ్యూలోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా రహానే, రింకూ, మనీశ్, రసెల్ వికెట్లను దక్కించుకున్నాడు. బుమ్రా తరహాలో మరో మాణిక్యాన్ని MI వెలికితీసిందని, త్వరలోనే అతడు భారత్‌కు ఆడతాడని క్రికెట్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

error: Content is protected !!