News April 11, 2025
సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు కోరిన ఎమ్మెల్సీ కవిత

అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ మద్దతు కోరారు. శుక్రవారం ఆయన్ను కలిసి బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని కోరారు. విగ్రహాన్ని ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామని, రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2025
NZB: భూ సమస్యలను గడువులోగా పరిష్కరిస్తాం: కలెక్టర్

భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు లేదా సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదన్నారు.
News April 18, 2025
NZB: దాశరథి పురస్కారానికి జిల్లా వాసి ఎంపిక

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్ లాల్ ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికయ్యాడు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. ఈ విషయాన్ని రావు ఆర్గనైజేషన్ కన్వీనర్ సతీశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్లో పురస్కార ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు.
News April 18, 2025
NZB: చరిత్ర ఆధారాలను గుర్తు చేస్తున్న క్లాక్ టవర్.. Way2News స్పెషల్..

NZBలో దశాబ్దాల క్రితం నిర్మించిన క్లాక్ టవర్ చారిత్రాత్మక ఆధారాలను గుర్తు తెస్తుంది. 1905లో సిర్నాపల్లి సంస్ధాన్ పాలకురాలు శీలం జానకీ బాయి క్లాక్ టవర్తో పాటు రెండు స్వాగత తోరణాలను నిర్మించేందుకు ఐదు ఎకరాలను విరాళంగా ఇచ్చారు. స్వాతంత్య్రానికి ముందు NZB మార్కెట్ యార్డును ‘మహబూబ్ గంజ్’ అని పిలిచేవారు. ఆ తర్వాత దానిని ‘గాంధీ గంజ్’గా మార్చారు. క్లాక్ టవర్లోని అలారం ఆధారంగా ఇక్కడ వ్యాపారాలు జరిగేవి.