News April 6, 2025

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన జాన్ వెస్లీ

image

మధురైలో జరుగుతున్న సీపీఎం 24వ జాతీయ మహాసభల్లో అమరచింత వాసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నేడు చివరి రోజు జరిగిన జాతీయ మహాసభలో కేంద్ర నాయకత్వం జాన్ వెస్లీకి కేంద్ర కమిటీలో స్థానం కల్పించింది. జాన్ వెస్లీ కేంద్ర కమిటీకి ఎన్నికైన నేపథ్యంలో అమరచింత సీపీఎం నాయకులు గోపి, బుచ్చన్న, అజయ్, వెంకటేశ్, రమేష్, శ్యాంసుందర్ జాన్ వెస్లీకి అభినందనలు తెలిపారు.

Similar News

News November 8, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓అన్నపురెడ్డిపల్లి: పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
✓దమ్మపేట: కలప పట్టివేత
✓ఫర్నిచర్ శిక్షణకు 11 మంది ఎంపిక: కలెక్టర్
✓ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రి సేవలు భేష్.. CRM బృందం నివేదిక
✓మణుగూరు పార్టీ ఆఫీస్ కాంగ్రెస్‌దే: INTUC
✓రైతాంగ సమస్యలపై ఈనెల 12న గ్రామీణ బంద్: CPI(ML)
✓కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం
✓మాదకద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయి: ఆళ్లపల్లి ఎస్సై

News November 8, 2025

ఘోర ప్రమాదం.. కారు ఎలా ధ్వంసమైందో చూడండి!

image

UPలోని షమ్లీలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును స్విఫ్ట్ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు కజిన్ బ్రదర్స్ చనిపోగా, ఒకరికి రేపు పెళ్లి కావాల్సి ఉంది. ఘటన జరిగినప్పుడు కారులోని భాగాలు 100M దూరంలో పడ్డాయి. వాహనం నామ రూపాల్లేకుండా మారడంపై SMలో చర్చ జరుగుతోంది. కొన్నికార్లలో సేఫ్టీ అధ్వానంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News November 8, 2025

మిర్యాలగూడ: మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈదులగూడ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పాస్మో ప్రోగ్సి వొన్ ప్లస్ మాత్రలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.