News October 22, 2025

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి

image

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.

Similar News

News October 22, 2025

విష్ణు వామనావతారం ఎందుకు ఎత్తాడు?

image

దానశీలి బలి చక్రవర్తి అపారమైన యాగబలంతో ఇంద్ర పదవిని ఆక్రమించి 3 లోకాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇది లోకాల సమతుల్యతను దెబ్బతీయడంతో పాటు దేవతల్లో ఆందోళన పెంచింది. ​అందుకే విష్ణువు, బలి దానగుణాన్ని గౌరవిస్తూనే, అతని అహంకారాన్ని అణచడానికి, లోకాలను రక్షించడానికి వామనుడి రూపంలో వచ్చాడు. కేవలం మూడడుగుల నేల అడిగి, బలిని పాతాళానికి పంపాడు. సద్గుణాలకు మెచ్చి ఆ లోకానికి రాజుగా చేసి, ధర్మాన్ని నిలబెట్టాడు.

News October 22, 2025

ములుగు: చెల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తూ.. అక్క మృతి

image

ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18068173>>ఇంటర్ విద్యార్థిని<<>> సింధూజ మృతిచెందిన విషయం తెలిసిందే. కన్నాయిగూడెం మం. చిట్యాల వాసి సింధూజ(17) చెల్లి శ్రీపూజకు తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గ్రామానికి చెందిన యువకుడు కృష్ణారావు సాయం కోరింది. ముగ్గురు కలిసి ఆస్పత్రికి బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే సింధూజ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News October 22, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.