News April 21, 2025

సీలేరులో ఇద్దరు యువకులు గల్లంతు

image

చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. చింతూరుకి చెందిన శ్రీను, ప్రదీప్ గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. స్నానం చేయడానికి సీలేరు నదిలో దిగిన  ప్రవాహానికి కొట్టుకుపోవడంతో అతన్ని రక్షించుకోవడం కోసం నదిలో దిగిన మరొక యువకుడు గల్లంతైనట్లు సమాచారం. స్థానికులు చింతూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 21, 2025

ప్యాదిండిలో 2 బైకులు.. కారు ఢీ

image

చెన్నై కొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఒక కారు ఢీకొన్నాయి. దీంతో రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన సాయి చనిపోయాడు. ప్యాదిండి గ్రామానికి చెందిన రమేశ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గాయపడిన రమేశ్‌ను చికిత్సకు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

ఆటోనగర్‌ లాడ్జీల్లో తనిఖీలు

image

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.

News April 21, 2025

వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

వినుకొండ: పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. శనివారం క్రికెట్ ఆడుతుండగా గౌస్ బాషా (చంటి) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మూడేళ్ల క్రితమే వివాహమైన చంటి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

error: Content is protected !!