News May 25, 2024
సీలేరు: 2.286.14 మిలియన్ యూనిట్లు లక్ష్యం

సీలేరు కాంప్లెక్స్లోని జలవిద్యుత్ కేంద్రాలకు విద్యుత్ ఉత్పత్తి 2.286.14 మిలియన్ యూనిట్లుగా సెంట్రల్ విద్యుత్ అధారిటీ నిర్దేశించినట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. కాంప్లెక్స్ పరిధిలో పొల్లూరు(లోయర్ సీలేరు) 1084 మిలియన్ యూనిట్లు, డొంకరాయి 95.14 మిలియన్ యూనిట్లు నిర్దేశించారు. అలాగే ఎగువ సీలేరు 477 మిలియన్ యూనిట్లు, మాచ్ ఖండ్ 630 మిలియన్ యూనిట్లుగా లక్ష్యం నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 12, 2025
విశాఖలో టెక్ తమ్మిన సంస్థకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖ మధురవాడలోని హిల్ నెంబర్-2లో టెక్ తమ్మిన ఐటీ సంస్థ క్యాంపస్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శుక్రవారం భూమిపూజ చేశారు. టెక్ తమ్మిన సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్,దుబాయ్,ఇండియాలో తన సేవలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఈవో రాజ్ తమ్మిన,ఎంపీ భరత్ ఉన్నారు.
News December 12, 2025
పూర్వ విద్యార్థుల సమావేశానికి సిద్ధమవుతున్న AU

ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్షిక పూర్వ విద్యార్థుల సమావేశం 2025కు సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా కార్యక్రమం జరగనుంది. శతాబ్ది సంవత్సరంలో జరుగుతున్న ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. సంఘం వ్యవస్థాపక చైర్మన్ జి.ఎం రావు తదితరులు పాల్గొంటారు. వర్సిటీ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
News December 12, 2025
విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం విశాఖ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఆవేదన చెందారు. రెగ్యులర్ స్టాఫ్కు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కొందరు విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ఇంటిని ఆక్రమించారని, న్యాయం చేయాలని ఒకరు కోరారు.


