News March 16, 2025
సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బుక్కపట్నంలోని డిగ్రీ కళాశాలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదివిన వారు ఈ కోర్సులు నేర్చుకోవడానికి అర్హులు అన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తులు చేసుకోవాలని, మూడు నెలల శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 16, 2025
IMLT20: ఇండియా మాస్టర్స్ టార్గెట్ ఎంతంటే?

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 ఫైనల్లో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 148 పరుగులు చేసింది. సిమ్మన్స్(57), డ్వేన్ స్మిత్(46) మినహా ఆ జట్టు బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వినయ్ 3, నదీమ్ 2, బిన్నీ, పవన్ తలో వికెట్ తీశారు. ఇండియా మాస్టర్స్ టార్గెట్ 149.
News March 16, 2025
స్వచ్ఛ సర్వేక్షన్- 2024లో మెరుగైన ర్యాంకు సాధనకు కృషి

స్వచ్ఛ సర్వేక్షన్- 2024లో మెరుగైన ర్యాంకు సాధనకు కృషి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా పరిధిలోని షీ టాయిలెట్స్తో పాటు పబ్లిక్ టాయిలెట్స్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి పనితీరును ఎంహెచ్ఓ అడిగి తెలుసుకున్నారు. నగరానికి మారు ఓడిఎఫ్ ++ సర్టిఫికెట్ సాధించేలా ప్రజా మరుగుదొడ్లు నిర్వహణ ఉండాలన్నారు. మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించాలని తెలిపారు.
News March 16, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం రోజున నిజాంసాగర్లోని హాసన్పల్లి, పాల్వంచలోని ఎల్పుగొండ, 41.8°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే డోంగ్లి, జుక్కల్ 41.4, మద్నూర్లోని మేనూర్ 41.2, పిట్లం 41.1, మద్నూర్లోని సోమూరు, నాగిరెడ్డిపెట్, ఎల్లారెడ్డిలోని మచపూర్లో 40.9,బిచ్కుంద, దోమకొండ 40.7, కామారెడ్డిలోని కలక్టరేట్లో, గాంధారి, సర్వపూర్ 40.5°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.