News September 3, 2025

సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు : ఎమ్మెల్సీ కళ్యాణి

image

2017లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని ఆమె వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 4, 2025

రణస్థలంలో 500 ఉద్యోగాలకు జాబ్ మేళా

image

శ్రీకాకుళం(D) రణస్థలంలో ఈ నెల 6న 500 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఈ మేళా జరగనుందన్నారు. టెన్త్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వారు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.

News September 4, 2025

శ్రీకాకుళం: ‘బాల్యవివాహాల నివారణకు కృషి చేయాలి’

image

బాల్యవివాహాలు నివారణకు కృషి చేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ విమల అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలోని జిల్లా సీడీపీఓ, సూపర్‌వైజర్లతో బాల్యవివాహాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలు గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు.

News September 4, 2025

శ్రీకాకుళం మీదుగా చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

image

దసరా, దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మీదుగా చర్లపల్లి(CHZ), బ్రహ్మపుర(BAM) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం:07028 BAM- CHZ రైలును SET 6 నుంచి NOV 29 వరకు ప్రతి శనివారం నడుస్తాయన్నారు. నం:07027 CHZ- BAM రైలును SEPT 5 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు జిల్లాలో శ్రీకాకుళం రోడ్, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్చాపురంలో ఆగుతాయన్నారు.