News August 20, 2025

సుల్తానాబాద్: ‘రోగులకు మెరుగైన సేవలు అందించాలి’

image

సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, పీఏసీఎస్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా కొనుగోలు చేసిన రూ.12.50 లక్షల విలువైన అల్ట్రాసౌండ్, ఎన్‌ఎస్‌టీ యంత్రాలను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News August 21, 2025

నేటి ముఖ్యాంశాలు

image

⋆ లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
⋆ జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లుపై సభలో దుమారం
⋆ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి
⋆ భవిష్యత్తులో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం: CM రేవంత్
⋆ పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
⋆ కర్నూలు జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
⋆ మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో

News August 21, 2025

కృష్ణా: గణేష్ ఉత్సవాలకు ఆంక్షలివే..!

image

కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు వినాయక చవితి సందర్భంగా మండప నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. మట్టి విగ్రహాలే వాడాలన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తి గీతాలు మాత్రమే వినిపించాలని, DJలు, బాణసంచా, శబ్ద కాలుష్యం, రోడ్ల ఆక్రమణలు నిషేధమని హెచ్చరించారు.

News August 21, 2025

AP న్యూస్ రౌండప్

image

* కర్నూలు (D)లో <<17465047>>చిన్నారుల మృతి<<>> పట్ల CM చంద్రబాబు సంతాపం, జగన్ దిగ్భ్రాంతి
* విద్యాశాఖకు కేంద్రం అదనంగా రూ.432.19CR కేటాయింపు
* నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు పీపీలు, 15మంది ఏపీపీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లాయర్లపై ప్రభుత్వం వేటు
* PRC, డీఏలపై వెంటనే ప్రకటన చేయాలి: APNGO అధ్యక్షుడు విద్యాసాగర్
* అప్పులు తీరాక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: బొత్స