News January 10, 2025
సూర్యఘర్ పథకానికి కేంద్రం సబ్సిడీ: కలెక్టర్

విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందడానికి చక్కని పరిష్కారం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో ఇప్పడు సోలార్ రూఫ్ టాప్ పథకం సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ మేరకు భీమవరం ఆమె కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పీఎం సూర్య ఘర్ పోర్టల్ pmsuryaghar.gov.inలో దీని కోసం రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
Similar News
News December 18, 2025
రైతు బజార్లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

భీమవరం రైతు బజార్లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.
News December 18, 2025
రైతు బజార్లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

భీమవరం రైతు బజార్లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.
News December 17, 2025
ప.గో: మరణంలోనూ వీడని బంధం

జీవితాంతం కలిసి నడిచిన ఆ దంపతులను మరణం కూడా విడదీయలేకపోయింది. తాడేపల్లిగూడెం (M) ఆరుగొలనుకు చెందిన మలకా అబద్ధం(75) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భర్త వియోగాన్ని తట్టుకోలేక బుధవారం సాయంత్రం భార్య లక్ష్మి(65) కూడా తుదిశ్వాస విడిచింది. దంపతులు ఇద్దరూ గంటల వ్యవధిలో మరణించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది.


