News May 18, 2024

సూర్యలంక బీచ్‌లో వైసీపీ అభ్యర్థి నూరిఫాతిమా

image

మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాజకీయ నేతలు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నూరిఫాతిమా ఎన్నికల ప్రచారం తనదైన శైలిలో నిర్వహించారు. పోలింగ్ అయిపోగా, శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో సేదదీరారు.

Similar News

News April 23, 2025

గుంటూరు డాక్టర్ అరుదైన రికార్డు 

image

NTR హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో గుంటూరు GGH న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గాజుల రామకృష్ణ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ పీజీ పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీతో పాటు కార్డియాలజీ పీజీలు పూర్తిచేసిన ప్రపంచంలోనే తొలి డాక్టరుగా అరుదైన గౌరవం పొందారు. వేమూరు(M) చావలికి చెందిన రామకృష్ణ గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి, ప్రభుత్వ వైద్య సేవల్లో అనేక బాధ్యతలు చేపట్టారు

News April 23, 2025

గుంటూరు: టెన్త్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

image

గుంటూరు జిల్లాలో 30,410 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 29,459 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ కాగా, 2024లో పరీక్షలు తప్పినవారు, ప్రవేట్‌గా రాస్తున్న వారు 961 మంది ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు SSC పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు పరీక్షల విభాగ డైరెక్టర్ KV శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వే2న్యూస్‌ ద్వారా వేగంగా పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు.

News April 22, 2025

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం

image

మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) డీపీఆర్ తయారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ పని కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి మే 14లోగా ఆర్ఎఫ్‌పీలు (ప్రతిపాదనలు) కోరుతూ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం నిర్మాణంతో పాటు అక్కడి ప్రధాన రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ డిజైన్‌కు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు.

error: Content is protected !!