News December 17, 2025
సూర్యాపేటలో తొలి సర్పంచ్ విజయం

సూర్యాపేట జిల్లాలో బుధవారం నిర్వహించిన మూడో విడత ఎన్నికల మొదటి ఫలితం విడుదలైంది. ఈ ఎన్నికలో నేరేడుచర్ల మండలం జానలదిన్నె గ్రామ పంచాయతీ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జి సరిత బీఆర్ఎస్ అభ్యర్థిపై 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తన వంతు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానన్నారు.
Similar News
News December 17, 2025
INDvsSA.. 4వ T20 రద్దు?

IND-SA మధ్య 4వ T20 రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నోలో AQI అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది. 6.30PMకు టాస్ వేసే సమయంలోనే పొగమంచు కురుస్తుండడంతో విజిబిలిటీ లేదని మ్యాచ్ను అంపైర్లు పోస్ట్పోన్ చేశారు. రాత్రి కావడంతో పొగమంచు తీవ్రమవుతుంది. ప్లేయర్లు అనారోగ్యం బారినపడే ఛాన్స్ ఉండటంతో మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సుంది. 9pmకు మరోసారి అంపైర్లు పరిశీలించిన తర్వాత క్లారిటీ రానుంది.
News December 17, 2025
రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు: చంద్రబాబు

AP: రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ కీలకమని, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాల కల్పన ఎలా చేయగలం అనే అంశంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
News December 17, 2025
గంభీరావుపేట సర్పంచ్గా పద్మ విజయం

గంభీరావుపేట మండల కేంద్రం గ్రామ సర్పంచ్గా మల్లుగారి పద్మ ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా గంభీరావుపేట గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించి ఆశీర్వదించిన గ్రామస్థులందరికీ నూతన సర్పంచ్ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.


