News March 17, 2025
‘సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట వంట వార్పు’

తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు 48గంటల పాటు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ జిల్లా కన్వీనర్ బొలిశెట్టి భాస్కరమ్మ, సీటు జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, అంగన్వాడీ టీచర్లు, వెల్ఫేర్లు పాల్గొన్నారు.
Similar News
News November 5, 2025
భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు BCCI జట్టును ప్రకటించింది. పంత్, అక్షర్ జట్టులోకి వచ్చారు.
✒ టెస్ట్ టీమ్: గిల్(C), పంత్ (VC), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురెల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్, నితీశ్, సిరాజ్, ఆకాశ్, కుల్దీప్
✒ ODI IND-A టీమ్: తిలక్(C), రుతురాజ్(VC), అభిషేక్, పరాగ్, ఇషాన్, బదోని, నిషాంత్, V నిగమ్, M సుతార్, హర్షిత్, అర్ష్దీప్, ప్రసిద్ధ్, ఖలీల్, ప్రభ్సిమ్రాన్
News November 5, 2025
శ్రీకాకుళం: ‘ప్రతి 3నెలలకు ఒకసారి సమావేశం’

జిల్లాను అభివృద్ధిబాటలో నడిపించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం ZP సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా సమీక్షలో అయన పాల్గొన్నారు. వ్యవసాయం, ఉపాధి కల్పన,పరిశ్రమలు,పారిశుద్ధ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో చర్చించవలసిన అంశాలపై ప్రతి 3నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లా MLAలు పాల్గొన్నారు.
News November 5, 2025
‘ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం’

ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని డీసీఎం పవన్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఇతర అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఏటిమొగ-ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయన్న పవన్.. అలైన్మెంట్లో మార్పుల కారణంగా మరో రూ.60 కోట్ల వ్యయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారన్నారు.


