News October 21, 2025
సూర్యాపేట ఘటనకు పదేళ్లు.. అమరులైన పోలీసులు

సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద 2015, ఏప్రిల్ 1న సిమీ ఉగ్రవాదులు పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనకు నేటితో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ దారుణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మెట్టు లింగయ్య, హోంగార్డు మహేష్ అక్కడికక్కడే మృతి చెంది అమరులయ్యారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనను జిల్లా పోలీసులు, ప్రజలు నేటికీ మరువలేక అమరుల త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.
Similar News
News October 21, 2025
కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.
News October 21, 2025
ములుగు: ఈ ఘటనకు 25 ఏళ్లు..!

ఏటూరునాగారంలోని పోలీస్ స్టేషన్ను 2001లో పేల్చివేత ఘటనలో మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ మందు పాత్రలు పెట్టి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులతో పాటు.. ఒక అటవీ అధికారి, పూజారి మృతి చెందాడు. ఆ సమయంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ విరోచితంగా పోరాడి నక్సల్స్ దాడిని ఎదురించారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. SHARE
News October 21, 2025
జూబ్లీహిల్స్: అనుమానమొస్తే అబ్జర్వర్లకు ఫిర్యాదు చేయవచ్చు!

జూబ్లీహిల్స్ బైపోల్స్ పరిశీలనకు ఈసీ అబ్జర్వర్లను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, శాంతిభద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియజేయవచ్చు. జనరల్ అబ్జర్వర్: 92475 05728, పోలీస్ అబ్జర్వర్: 92475 05729, ఎక్స్ పెండేచర్ అబ్జర్వర్: 92475 05727 నంబర్లకు కాల్ చేయొచ్చు.