News October 22, 2025
సూర్యాపేట: జాబ్ మేళా ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈ నెల 25న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్, ఎస్పీ నర్సింహాతో కలిసి మంగళవారం పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 22, 2025
VKB: ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా వదిలేసిన తండ్రి

వికారాబాద్ పట్టణంలో రాత్రి ఒంటరిగా ఉన్న ఇద్దరు ఆడపిల్లలను గుర్తించిన పోలీసులు చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బందికి అప్పగించారు. హైదరాబాద్ నుంచి కారులో వచ్చి ఎస్బీఐ బ్యాంక్ వద్ద తండ్రి తమను వదిలి వెళ్లినట్లు పిల్లలు తెలిపారు. వారు గుర్దొడ్ల తమ అమ్మమ్మ ఊరు అని చెప్పారు. దీంతో అధికారులు పిల్లలను శిశుగృహకు తరలించారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు కోరారు.
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.
News October 22, 2025
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 76,343 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 18,768 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.34 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.