News December 1, 2025

‘సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి’

image

పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంగా వీర తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని, పోరాట చరిత్రకు సాక్షిగా నిలబడ్డ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు సూర్యాపేట జిల్లాకు పెట్టాలని ఎంసీపీఐయూ జిల్లా నాయకులు అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వర్గ సభ్యులు వెంకన్న, నజీర్ మాట్లాడుతూ.. పాతికేళ్ల పార్లమెంటరీ ఉద్యమ సారథిగా బీఎన్ రాష్ట్రపతి అవార్డు పొందారన్నారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో రేపు యథావిధిగా స్కూల్స్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మంగళవారం యథావిధిగా స్కూల్స్ కొనసాగనున్నాయి. ‘దిత్వా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో సోమవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 2న మోస్తరు వర్షాలు కురవనుండడంతో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించాలని DEO ఆదేశాలు జారీ చేశారు.

News December 1, 2025

పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

image

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.

News December 1, 2025

తిరుపతి: రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈవో

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు మంగళవారం యథావిధిగా కొనసాగుతాయని డీఈవో కుమార్ తెలిపారు. దిత్వా తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎలాంటి సెలవు లేదని స్పష్టం చేశారు. ఎంఈవోలు, డీవైఈవోలు విద్యార్థులకు సమాచారం అందించి పాఠశాలలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.