News January 2, 2026

సూర్యాపేట జిల్లాలో 17 మందికి కుష్టు వ్యాధి గుర్తింపు

image

సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 17 మందికి కుష్టు వ్యాధి సోకినట్లు గుర్తించామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ తెలిపారు. డిసెంబరు 18 నుంచి 31 వరకు ఆశా కార్యకర్తలు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి 1,042 మంది అనుమానితులను గుర్తించగా, పరీక్షల అనంతరం 17 మందికి నిర్ధారణ అయ్యిందన్నారు. బాధితులకు ఉచితంగా చికిత్స ప్రారంభించామని, లక్షణాలుంటే వెంటనే ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.

Similar News

News February 10, 2026

రేపు ఉద్యోగులకు సెలవు

image

TG: రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది. మున్సిపల్, కార్పొరేషన్లలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ మంజూరు చేసింది. సెలవు లేదనే కారణంగా ఓటుకు దూరం కావొద్దని ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే <<19099000>>సెలవు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.

News February 10, 2026

నెల్లూరు: వ్యవసాయ పరికరాలు ఈసారైనా..?

image

జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనది. అయినా రెండేళ్ల నుంచి రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద యంత్ర పరికరాలు మంజూరు కాలేదు. ఫలితంగా దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన వరికొత మిషన్లు, డ్రోన్లు వంటి 1452 రకాల పరికరాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు డ్రోన్లుకు ఇప్పటికే దరఖాస్తులు వచ్చినా నిధులు లేమి వేధిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ యాంట్రీకరణకు నిధులు కేటాయిస్తారో.. లేదో చూడాల్సి ఉంది.

News February 10, 2026

అల్లు అర్జున్‌ 42 రూల్స్ అంటూ ప్రచారం.. AA టీమ్ సీరియస్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బ్రాండ్ స్ట్రాటజిస్ట్ <<19101939>>కావేరీ బారువా<<>> చేసిన వ్యాఖ్యలపై AA టీమ్ స్పందించింది. ‘ఇటీవల అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ఈ ఆరోపణలను మేము సీరియస్‌గా తీసుకున్నాం. బాధ్యులపై పరువునష్టం దావా వేసేందుకు మా లీగల్ టీమ్ సిద్ధమవుతోంది. ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని షేర్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని ప్రకటన విడుదల చేసింది.