News March 17, 2025
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు ప్రజావాణి

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కే.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా బాధితులు తమ సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News January 5, 2026
రాజీనామాపై మరోసారి ఆలోచించండి.. కవితకు ఛైర్మన్ సూచన

TG: MLC పదవికి రాజీనామాపై మరోసారి ఆలోచించుకోవాలని కవితకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ సూచించారు. ‘కవిత ఆవేదనను అర్థం చేసుకున్నాం. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది. భావోద్వేగంలో నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు’ అని పేర్కొన్నారు. అయితే తాను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని, రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరారు. వ్యక్తిలా వెళ్లి శక్తిలా తిరిగొస్తానన్నారు.
News January 5, 2026
నిర్మల్: మున్సిపల్ రేసులో పెరగనున్న ఎన్నికల వేడి

జిల్లాలోని 3 మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. తాజా గణాంకాల ప్రకారం NRMLలో 98,295, భైంసా 51,118, ఖానాపూర్లో 17,693 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం పెరగడం, పాత వార్డుల్లో కుటుంబాల విస్తరణతో తుది జాబితా నాటికి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓట్ల సంఖ్య పెరిగితే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై అదనపు భారం పడనుంది.
News January 5, 2026
HYD: 1,200 బస్సులతో సంక్రాంతికి వస్తున్నాం..!

జనవరి వచ్చిందంటే సంక్రాంతి ముచ్చట్లే ఉంటాయి. సొంతూరుకు ఎప్పుడెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే చర్చలు ఎక్కడ చూసినా ఉంటాయి. సంక్రాంతి సెలవుల్లో సొంతూరిలో గడిపితే ఆ మజానే వేరబ్బా అని పలువురు నగరవాసులు భావిస్తున్నారు. అందుకే ఆర్టీసీ నగర ప్రయాణికుల కోసం ఈ ఏడాది 1,200 ప్రత్యేకంగా బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. ఈ నెల 9 నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించింది.


