News November 19, 2025
సూర్యాపేట జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా విభాగానికి చెందిన డా.రావుల కృష్ణయ్య పరిశోధక విద్యార్థిని సాక్షి సంయుక్తంగా చేసిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారు రూపొందించిన పరిశోధనా పత్రం, జర్మన్ కమిషన్ ఫర్ యునెస్కో, జర్మన్ రెక్టర్స్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా జర్మనీలోని హానోవర్లో నవంబర్ 19-21 మధ్య నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైంది.
Similar News
News April 14, 2026
విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

విద్యార్థులకు, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో Vishwa Vishwani Institute of Systems and మేనేజ్మెంట్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నూతనంగా BS Computer Science (UGC AEDP) కోర్సును ప్రారంభించారు. ఈ 4 సంవత్సరాల ప్రోగ్రామ్లో 2 ఏళ్లు క్యాంపస్లో చదువు, తదుపరి 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో అప్రెంటిషిప్ శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 14, 2026
పోచంపల్లి: చెరువులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

పోచంపల్లి మండలం గౌస్కొండలో విషాదం నెలకొంది. చెరువులో సరదాగా షికారుకు వెళ్లి గల్లంతైన శివ అనే యువకుడి మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. ఆరుగురు స్నేహితులు నాటు పడవపై వెళ్తుండగా, పడవలోకి నీరు చేరడంతో ప్రమాదం సంభవించింది. ప్రాణభయంతో అందరూ నీటిలోకి దూకగా, ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈత రాని శివ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం దొరకడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News April 14, 2026
జగిత్యాల: భవన నిర్మాణ కూలీగా ప్రభుత్వ టీచర్

11 ఏళ్లు వీఆర్ఏగా పనిచేసిన JGTL(D) కొడిమ్యాల (M) చెప్యాలకు చెందిన లక్ష్మీరాజం, ఉపాధ్యాయుడిగా ఎంపికై ఎనిమిది నెలలకే ఆ కొలువు కోల్పోయారు. ఆర్సీఐ వెరిఫికేషన్ సమస్యతో అధికారులు ఆయన్ను తొలగించడంతో, ప్రస్తుతం కుటుంబ పోషణకు భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. అటు పాత ఉద్యోగం లేక, ఇటు టీచర్ కొలువు పోయి రోడ్డున పడ్డానని, తనకు న్యాయం చేయాలని ఆయన సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ను వేడుకున్నారు.


